రంగస్థలం’ నచ్చిందా ‘గురూ’?

ఒకవైపు థియేటర్స్‌లో చిట్టిబాబు చితక్కొట్టుడుకి బాక్సాఫీస్ షేక్ అవుతూ కలెక్షన్ల వర్షం కురుస్తుంటే… మరోవైపు ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రామ్ చరణ్ తేజ్, సమంత జోడీగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ మార్చి 30న విడుదలైన పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతూ వందకోట్ల క్లబ్‌లో చేరింది. చిట్టిబాబుకి రామ్ చరణ్, రామలక్ష్మిగా సమంత, ప్రెసిడెంట్‌గా జగపతిబాబు, రత్తమ్మత్తగా అనసూయ, కుమార్ బాబుగా ఆది నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ మూవీ కామన్ ఆడియన్స్‌తో పాటు సెలబ్రిటీలతో శభాష్ అనిపించుకుంటోంది. తాజాగా ఈ మూవీని చూసిన విక్టరీ వెంకటేష్ చిట్టిబాబు నటనకు ఫిదా అయిపోయా అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

‘రామ్ చరణ్ రంగస్థలం మూవీని చూశా. చిట్టిబాబు క్యారెక్టర్‌లో రామ్ చరణ్ జీవించారు. ఆయనకు ఈ పాత్ర కరెక్ట్‌గా సూట్ అయ్యింది. చిట్టిబాబుకి తిరుగేలేదు. ఈ పాత్రను ఇంత చక్కగా డిజైన్ చేసిన దర్శకుడు సుకుమార్‌కి హ్యాట్సాఫ్. ఈ సినిమాలో పాత్రల తీరు అమోఘం అంటూ చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ.. శుభాకాంక్షల్ని తెలియజేశారు విక్టరీ వెంకటేష్. By mana news

Leave a comment